: తెలంగాణలో బీజేపీ మరింత శక్తిమంతంగా ఎదగాలి: రామ్ మాధవ్

తెలంగాణలో బీజేపీ మరింత శక్తిమంతంగా ఎదగాలని ఆ పార్టీ జాతీయ నేత రామ్ మాధవ్ అన్నారు. వరంగల్ లో జరుగుతున్న బీజేపీ కార్యవర్గ సమావేశంలో ఈ రోజు ఆయన మాట్లాడుతూ, తమ పార్టీ కేవలం నాయకుల పార్టీ కాదని, కార్యకర్తల పార్టీ అని అన్నారు. ఎన్నికల్లో గెలుపు కోసమే నేతలు, కార్యకర్తలు పని చేయాలని, దేశంలో మోదీకి 70 శాతం మంది ప్రజల ఆదరణ ఉందని ఈ సందర్భంగా చెప్పారు.

ప్రజల జీవితాల్లో మార్పు కోసమే అధికారంలోకి వచ్చామని, అవినీతి నిర్మూలనకు చిత్తశుద్దితో కృషి చేస్తున్నామని అన్నారు. అయితే, దేశంలో అవినీతిని నిర్మూలించడం అంత సులభం కాదని, మూలాల నుంచి దానిని నిర్మూలించాల్సిన అవసరం ఉందని రామ్ మాధవ్ అన్నారు.

More Telugu News