: జీడిమెట్లలో కల్తీ పచ్చళ్లు.. రంగంలోకి దిగిన ఎస్ఓటీ పోలీసులు!

హైదరాబాద్ శివారు జీడిమెట్లలో కల్తీ పచ్చళ్ల దందా వెలుగు చూసింది. ఈ మేరకు సమాచారం అందడంతో బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు రంగంలోకి దిగారు. కల్తీ కారం, కల్తీ ఆవపొడి సహా కల్తీ ముడిసరుకుతో పచ్చళ్లను తయారీ చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. సదరు ముఠా పచ్చళ్ల తయారీకి పప్పులు, ధనియాలు, నూనెల నుంచి ఆవాల వరకు అన్నీ కల్తీవే ఉపయోగిస్తున్నారని ఎస్ఓటీ పోలీసులు చెప్పారు. ఈ సోదాల్లో సుమారు రూ.15 లక్షల విలువైన కల్తీ పచ్చళ్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు కంపెనీ యాజమాన్యానికి నోటీసులు ఇచ్చినట్టు చెప్పారు.

More Telugu News