: నాడు బతికిపోయాడు... నేడు బుక్కవుతున్నాడు: ప్రముఖ హీరో చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!

తెలుగు సినీ ఇండస్ట్రీలో అతని పేరు చిరస్థాయిగా నిలిచిపోయిందనడంలో సందేహం లేదు. ఓ భారీ చిత్రంలో ప్రతినాయకుడిగా నటించిన అతను, కలెక్షన్ల రికార్డులను తిరగరాసిన రికార్డునూ మూటగట్టుకున్నాడు. అయితేనేం, డ్రగ్స్ కేసులో ప్రస్తుతం అతని చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఓ ప్రముఖ నిర్మాత కుటుంబానికి చెందిన ఈ హీరో పేరు గతంలోనూ డ్రగ్స్ కేసులో ఓసారి తెరపైకి వచ్చింది. హైదరాబాద్‌ పశ్చిమ మండలంలో మత్తుమందుల ముఠాను పట్టుకున్నప్పుడు అతని పేరు వచ్చింది.

అయితే, నాడు కేసుల దర్యాఫ్తు ముందుకు సాగేందుకు అవసరమైన సాక్ష్యాలు లభించకపోవడంతో అప్పట్లో బతికిపోయాడని తెలుస్తోంది. ఇక తాజాగా కెల్విన్ నుంచి పూరీ జగన్నాథ్, సుబ్బరాజు, తరుణ్ ల విచారణ తరువాత అతని పేరే ప్రముఖంగా వినిపిస్తోంది. తొలి జాబితాలో నోటీసులు పొందిన వారి విచారణ ఆగస్టు 2 వరకూ సాగనుండగా, ఆపై రెండో దఫా విచారణను ఎదుర్కొనే వారిలో ఇతనే అత్యంత కీలకమైన వ్యక్తిగా సిట్ అధికారులు భావిస్తున్నారు. అతనితో పాటు ఈ కేసులో బయటకు వచ్చిన, యూత్ లో క్రేజున్న మరో హీరోకూ వచ్చే వారం నోటీసులు జారీ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

More Telugu News