sharvanand: నాని సరసనే కాదు శర్వానంద్ జోడీగాను సాయిపల్లవి!

తెలుగు తెరపై సహజమైన నటనను ప్రదర్శించే కథానాయికల జాబితాలో సాయిపల్లవి కూడా చేరిపోయింది. 'ఫిదా' సెట్స్ పై ఉండగానే ఈ అమ్మాయి టాలెంట్ గురించి తెలిసి, నాని సరసన 'మిడిల్ క్లాస్ అబ్బాయి' సినిమా కోసం తీసుకున్నారు. ఈ సినిమాకి కూడా దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా తరువాత శర్వానంద్ జోడీగా ఈ అమ్మాయిని ఎంపిక చేసే అవకాశం ఉందనే టాక్ వినిపించింది.

 శర్వానంద్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో 'మహానుభావుడు' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన సుధీర్ వర్మ దర్శకత్వంలో ఒక రొమాంటిక్ థ్రిల్లర్ చేయనున్నాడు. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం సాయి పల్లవిని తీసుకోవాలనే ఆలోచన చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు 'ఫిదా' సక్సెస్ టాక్ తెచ్చుకోవడంతో, ఆమెనే ఖరారు చేసే ఆలోచనలో ఈ సినిమా టీమ్ ఉందని అంటున్నారు. మొత్తానికి సాయిపల్లవి నానితో పాటు శర్వానంద్ జోడీ కూడా కట్టేస్తుందన్న మాట.     

More Telugu News