: సిట్ అధికారులను కలసిన బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు

విశాఖ భూ కుంభకోణంపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఈ రోజు సిట్ అధికారులను కలిశారు. ఈ సందర్భంగా రాజవరం, మాధవధార, చిట్టివలస, ముదుపాకలలో జరిగిన భూ కబ్జాలు, ట్యాంపరింగ్ లపై సిట్ చీఫ్ వినిత్ బ్రిజ్ లాల్ కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎమ్మెల్యేలు చేసిన సిఫారసులతో ప్రభుత్వ లాయర్లను నియమించడం సరికాదని... వారికి సరైన పరిజ్ఞానం లేకుండా ప్రభుత్వ భూములను కోల్పోయే ప్రమాదం ఉంటుందని చెప్పారు. భూ కేసులను ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా పరిష్కరించాలని సూచించారు. సుమారు 2వేల ఫిర్యాదులు అందాయంటే... భూ దందాలు ఏ స్థాయిలో జరిగాయో అర్థమవుతోందని అన్నారు. 

More Telugu News