varun tej: నా కళ్లను నేను నమ్మలేకపోతున్నా: సాయిపల్లవి

శేఖర్ కమ్ముల కథను నమ్మే దర్శకుడు .. ఆ కథ అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందా? లేదా? అనే విషయం తెలిసిన నిర్మాత దిల్ రాజు. అలాంటి దర్శక నిర్మాతల కాంబినేషన్లో వచ్చిన 'ఫిదా' సినిమాకి ఆశించిన విధంగానే అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. దాంతో సాయిపల్లవి తనదైన శైలిలో స్పందించింది.

'భానుమతి' అనే తెలంగాణ యువతి పాత్రలో ఆడియన్స్ తనని రిసీవ్ చేసుకుంటారా? తెలంగాణ యాసను పలికించడంలో తన వాయిస్ వాళ్లకి నచ్చుతుందా? ఇలా తనపై తనకి ఎన్నో సందేహాలు వుండేవనీ, ఈ సినిమాకి వస్తోన్న రెస్పాన్స్ తో అవన్నీ పటాపంచలు అయ్యాయని సాయిపల్లవి చెప్పింది. తన పాత్ర చెప్పే డైలాగ్స్ కి ఆడియన్స్ క్లాప్స్ కొట్టడాన్ని .. విజిల్స్ వేయడాన్ని చూస్తూ తన కళ్లను తాను నమ్మలేకపోతున్నానని అంది. ఈ క్రెడిట్ అంతా కూడా తన నుంచి అంతటి అవుట్ పుట్ ను రాబట్టిన శేఖర్ కమ్ముల గారికి చెందుతుందని చెప్పుకొచ్చింది.   

More Telugu News