pooja hegde: గ్లామర్ డోస్ పెంచడం పూజా హెగ్డేకి కలిసొచ్చినట్టే!

తెలుగులో ఓ రెండు సినిమాలు చేసిన పూజా హెగ్డే, హిందీ సినిమా కోసం గ్యాప్ తీసుకుంది. ఆ తరువాత 'దువ్వాడ జగన్నాథమ్' సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టింది. ఈ సినిమాతో యూత్ ను ఆకట్టుకోవడానికి ఆమె చేసిన ప్రయత్నం ఫలించిందనే అంటున్నారు. తెరపై అందాల ఆరబోతతో గ్లామర్ డోస్ పెంచేసింది.

 ఈ కారణంగా పూజా హెగ్డేకి మరిన్ని అవకాశాలు రావడం ఖాయమని చెప్పుకున్నారు. అనుకున్నట్టుగానే పెద్ద బ్యానర్ ల నుంచి ఆమెకి ఆఫర్లు వస్తున్నాయట. ఆమెను సంప్రదిస్తోన్న దర్శక నిర్మాతల సంఖ్య ఎక్కువగానే ఉందని అంటున్నారు. ఇప్పటికే ఒక స్టార్ హీరో సినిమాలో ఆమెకి ఛాన్స్ లభించిందనీ .. మరో రెండు భారీ ప్రాజెక్టులలో ఆమెకి స్థానం దక్కనుందని చెబుతున్నారు. ఈ ప్రాజక్టులు ఖరారైపోతే .. పూజా హెగ్డే హవా మొదలయ్యే అవకాశాలు ఎక్కువే!    

More Telugu News