srinivas: సినిమాటో గ్రాఫర్ కే నాలుగున్నర కోట్లు ముట్టజెప్పారట!

బోయపాటి శ్రీను తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'జయ జానకి నాయక' రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్ .. టీజర్ .. సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా చేసిన ఈ సినిమాకి భారీ స్థాయిలో ఖర్చు చేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

 'జయ జానకి నాయక'కి సినిమాటో గ్రాఫర్ గా బోయపాటి శ్రీను 'రుషి పంజాబి'ని తీసుకున్నాడు. 'సరైనోడు' సినిమాకి కూడా ఈ ఇద్దరూ కలిసి పనిచేశారు. ఫోటోగ్రఫీ పరంగా ఆ సినిమాకి మంచి మార్కులు దక్కాయి. అందువలన ఈ సినిమాకి కూడా బోయపాటి ఆయననే తీసుకున్నాడు. ఈ సినిమాకి పని చేసినందుకుగాను ఋషి పంజాబి టీమ్ కి .. ఎక్విప్ మెంట్ కి కలుపుకుని నాలుగున్నర కోట్లను ముట్టజెప్పినట్టు టాక్. అయితే అంతకి మించిన క్వాలిటీని ఆయన అందించారని దర్శక నిర్మాతలు చెబుతుండటం విశేషం.         

More Telugu News