Thamanna: సినిమా కబుర్లు ... సంక్షిప్త సమాచారం

*  'ఈ సినిమా ఇండస్ట్రీలో రోజుకొక కొత్త విషయం నేర్చుకుంటున్నాను..' అంటోంది కథానాయిక తమన్నా. "వచ్చినప్పటి నుంచీ నేను ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూనే వున్నాను. అలా నేర్చుకోవడం అన్నది నాకు ఒక తపన. అది నటిగా నాకు ఎంతో హెల్ప్ అయింది. ఒక విధంగా చెప్పాలంటే, నేనీ స్థాయిలో ఉన్నానంటే ఆ తపనే కారణమనుకుంటున్నాను" అని చెప్పింది.      
*  గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిన 'గౌతమ్ నంద' చిత్రం సెన్సార్ పూర్తయింది. దీనికి సెన్సార్ U/A సర్టిఫికేట్ ఇచ్చింది. హన్సిక, కేథరిన్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని ఈ నెల 28న విడుదల చేస్తున్నారు.
*  దశాబ్దాల క్రితం హత్యకు గురైన ఉస్మానియా విద్యార్థి నాయకుడు జార్జి రెడ్డి జీవితకథ వెండితెరకు ఎక్కుతోంది. ఇటీవల వచ్చిన 'వంగవీటి' సినిమాలో నటించిన సాండి హీరోగా, 'దళం' చిత్ర దర్శకుడు జీవన్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్టుతో ఈ చిత్రాన్ని నిర్మిస్తామని దర్శకుడు చెప్పారు.
*  కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన 'నక్షత్రం' చిత్రం విడుదల వాయిదా పడింది. ఈ నెల 28న రిలీజ్ కావలసిన ఈ చిత్రాన్ని వచ్చే నెల 4కి వాయిదా వేశారు. ఇందులో సందీప్ కిషన్, రెజీనా హీరో హీరోయిన్లుగా నటించగా, సాయిధరం తేజ్, ప్రగ్యా జైస్వాల్ గెస్ట్ రోల్స్ వేశారు.      

More Telugu News