: సెంటిమెంట్ కోసం కాదు కంఫర్ట్ కోసమే బ్యాంకాక్ కు వెళుతుంటాను: పూరీ జగన్నాథ్

తాను బ్యాంకాక్ కు వెళ్లేది స్క్రిప్ట్ వర్క్ కోసమని, బీచ్ లో కూర్చుని రాసుకోవడం తనకు అలవాటని ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ అన్నారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘బీచ్ లో గొడుగులు అవీ వేసి ఉంటాయి. అక్కడ నాకు తెలిసిన ఓ ఫ్యామిలీ ఉంది. పదిహేనేళ్ల నుంచి నాకు వాళ్లు పరిచయం. వాళ్లు నాకు కాఫీ.. అవి ఇస్తుంటారు. ఏవైనా కావాలంటే తెచ్చిపెడుతుంటారు. అక్కడ కూర్చుని రాసుకుంటూ ఉంటాను. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అక్కడే కూర్చుని కదలకుండా రాస్తాను. మళ్లీ మర్నాడు ఉదయం అవే టైమింగ్స్ కు వచ్చి వర్క్ చేస్తుంటాను. వేరే వాళ్లు 6 నెలలు, ఒక సంవత్సరంలో రాసే స్క్రిప్ట్ ను నేను పదిహేను రోజుల్లో రాస్తాను, అంటే, నాకు ఎంత ఫోకస్ ఉండాలి. నేను సెంటిమెంట్ కోసం బ్యాంకాక్ వెళ్లను.. కంఫర్ట్ కోసం వెళతాను. నేను దేవుడ్నే మొక్కను, ఇంకా, సెంటిమెంట్లు ఏముంటాయి!’ అని పూరీ చెప్పుకొచ్చారు.

More Telugu News