varun tej : రాశిఖన్నాతో లండన్ కి బయల్దేరుతోన్న వరుణ్ తేజ్!

వరుణ్ తేజ్ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ఫిదా'కి, విడుదలైన అన్ని ప్రాంతాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. దాంతో ఈ సినిమా టీమ్ ఫుల్ ఖుషీగా వుంది. ఈ ఉత్సాహంతో వరుణ్ తేజ్ తన తదుపరి సినిమాను మరింత ఫాస్టుగా మొదలు పెట్టనున్నాడు. భోగవల్లి ప్రసాద్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మితం కానుంది.

 ఈ సినిమాలో కథానాయికగా రాశి ఖన్నాను తీసుకున్నారు. 'జై లవకుశ' తో పాటు ఆమె చేస్తోన్న సినిమా ఇదే. ఈ సినిమాకి సంబంధించిన మొదటి షెడ్యూల్ ను లండన్ లో ప్లాన్ చేశారు. అందువలన వరుణ్ తేజ్ .. రాశిఖన్నా లండన్ బయల్దేరనున్నారు. వాళ్లిద్దరి పై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారు. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడి చేయనున్నారు.   

More Telugu News