varun tej: భానుమతిగా సాయిపల్లవి యాక్టింగ్ అదుర్స్!

వరుణ్ తేజ్ - సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన 'ఫిదా' సినిమా .. ఈ రోజు ఉదయం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో సాయిపల్లవి .. తెలంగాణ ప్రాంతానికి చెందిన యువతిగా భానుమతి పాత్రను పోషించింది. ఈ పాత్రలో ఆమె లవ్ .. సెంటిమెంట్ .. ఎమోషన్ .. కామెడీని అద్భుతంగా పండించిందని అంటున్నారు.

 కుటుంబ నేపథ్యం .. ప్రేమ మధ్య మానసిక సంఘర్షణ అనుభవించే యువతిగా ఆమె పండించిన హావభావాలకి అంతా 'ఫిదా' అవుతున్నారు. కథ మన ఊళ్లో .. మన ఇంట్లో జరిగేలా అనిపించడంలో సాయిపల్లవి ప్రధానమైన పాత్రను పోషించిందని అంటున్నారు. తెలంగాణ యాసను ఆమె పలికి తీరుకు .. కామెడీ టైమింగ్ కు .. డాన్స్ కు ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ సినిమాకి ప్రధానమైన బలం .. ఆకర్షణ సాయిపల్లవేనని చెప్పుకుంటున్నారు.   

More Telugu News