nagachaitanya: నాగ్ డేట్ లో చైతూ రావడానికి రెడీ అవుతున్నాడట!

నాగచైతన్య కథానాయకుడిగా మారిముత్తు దర్శకత్వంలో 'యుద్ధం శరణం' సినిమా తెరకెక్కింది. లావణ్య త్రిపాఠి కథానాయికగా నటించిన ఈ సినిమాలో, విలన్ గా శ్రీకాంత్ కనిపించనున్నాడు. ఈ సినిమాను ఆగస్టు నెలలో విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పటికే చాలా సినిమాలు ఆగస్టులో తమ విడుదల తేదీలను ప్రకటించేశాయి. దాంతో ఈ సినిమా టీమ్ ఆలోచనలో పడింది.

ఇక నాగార్జున నటించిన 'రాజుగారి గది 2' సినిమాను కూడా ఆగస్టు 25వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. కానీ గ్రాఫిక్స్ పూర్తి కానందున .. ఆ రోజున రిలీజ్ చేయడం లేదు. అందువలన చైతూ సినిమాను ఆ రోజున విడుదల చేయడానికి రంగాన్ని సిద్ధం చేస్తున్నారట. ఈ సినిమాతో చైతూ హ్యాట్రిక్ హిట్ కొడతాడేమో చూడాలి మరి.   

More Telugu News