: స్వల్పంగా పెరిగిన పెట్రోలు, తగ్గిన డీజిల్ ధరలు

అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ ధరలు పెరిగిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఇండియాలో పెట్రో ఉత్పత్తుల ధరలను స్వల్పంగా సవరిస్తున్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పేర్కొంది. పెట్రోలు ధరను 2 నుంచి 3 పైసల మేరకు పెంచుతున్నామని, డీజిల్ ధరలను అంతే మొత్తంలో తగ్గిస్తున్నామని ప్రకటించింది. వివిధ నగరాల్లో నేటి పెట్రోలు, డీజిల్ ధరలు (లీటరుకు) ఇలా ఉన్నాయి.

న్యూఢిల్లీ: పెట్రోలు - రూ. 64.28, డీజిల్ - రూ. 55.02
కోల్ కతా: పెట్రోలు - రూ. 67.68, డీజిల్ - రూ. 57.77
ముంబై: పెట్రోలు - రూ. 73.61, డీజిల్ - రూ. 58.57
చెన్నై: పెట్రోలు - రూ. 66.75, డీజిల్ - రూ. 58.02
హైదరాబాద్: పెట్రోలు - రూ. 68.28, డీజిల్ - రూ. 59.93

More Telugu News