: చార్మి వల్లే నా భర్తకీ దుస్థితి..!: సన్నిహితుల వద్ద వాపోతున్న పూరీ భార్య లావణ్య

తన భర్త మత్తుమందుల కేసులో ఇరుక్కోవడానికి హీరోయిన్ చార్మీయే కారణమని దర్శకుడు పూరీ జగన్నాథ్ భార్య లావణ్య, తనకు తెలిసిన పరిశ్రమ పెద్దల వద్ద బాధపడినట్టు తెలుస్తోంది. ఆమెను పరామర్శించేందుకు వెళ్లిన వారి వద్ద కన్నీటిపర్యంతమైన లావణ్య, చార్మీతో ఉన్న అనుబంధం కారణంగానే తన భర్త ఫెయిల్యూర్ల బాటలో ఉన్నాడని, ఆర్థికంగా దెబ్బతిని, సర్వనాశనం కావడానికి కూడా ఆమే కారణమని చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి.

చార్మి సోదరులకు పంజాబ్ లోని డ్రగ్స్ ముఠాలతో సంబంధాలున్నాయని ఆమె సంచలన ఆరోపణలు చేసింది. తన భర్తను వాడుకుంటూ వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు చార్మి యత్నించిందని, ఆమె మత్తులో పడిన పూరీ ఆసలు సమస్యను విస్మరించాడని చెప్పినట్టు తెలుస్తోంది. ఆ రాక్షసితో కలవద్దని చెప్పినందుకు ఇంటికి రావడం కూడా మానేశాడని లావణ్య వాపోయిందట. డ్రగ్స్ దందాల విషయంలో చార్మి సోదరులను విచారించేందుకు హైదరాబాద్ పోలీసులు పంజాబ్ కు వెళ్లాలని కూడా ఆమె కోరినట్టు తెలుస్తోంది. ఇంత రాద్ధాంతం అవుతున్నా, తన కుటుంబ జీవితం చెడిపోరాదన్న ఉద్దేశంతో భర్తను ఒక్క మాట కూడా అనలేదని లావణ్య చెప్పినట్టు సమాచారం. ఇప్పుడు లావణ్య వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

More Telugu News