: తెలంగాణలో నేడు విద్యాసంస్థల బంద్.. ప్రభుత్వ తీరుకు నిరసనగా బంద్ పిలుపు!

కార్పొరేట్ విద్యా సంస్థలకు ప్రభుత్వం కొమ్ము కాస్తోందని ఆరోపిస్తూ తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు నేడు(శుక్రవారం) విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ మేరకు విద్యార్థి సంఘాల జేఏసీ ఓ ప్రకటన విడుదల చేసింది. కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వం వత్తాసు పలుకుతుండడంతో ప్రభుత్వ విద్యాసంస్థలు నీరుగారిపోతున్నాయని, మూతపడే స్థితికి చేరుకుంటున్నాయని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. ప్రభుత్వం ఇకనైనా కళ్లు తెరిచి ప్రభుత్వ విద్యాసంస్థలపై దృష్టిసారించాలని కోరాయి. నేటి బంద్‌కు  ఎస్‌ఎఫ్ఐ, పీడీఎస్యూ, టీవీవీ, ఏఐఎస్ఎఫ్‌, టీఎస్ఎప్‌ తదితర సంఘాలు మద్దతు ప్రకటించాయి.

More Telugu News