: 2 వేల కరెన్సీ నోట్ల పంపిణీ తగ్గింది..!

పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత మార్కెట్లోకి భారీ ఎత్తున 2వేల విలువైన నోట్లను రిజర్వ్ బ్యాంక్ పంపిణీ చేసింది. ఒకానొక సందర్భంలో జేబులో 2 వేల నోటు ఉన్నా... చిల్లర దొరక్క జనాలు పిచ్చెక్కిపోయిన ఉదంతాలు ఉన్నాయి. ఆ తర్వాత 500 విలువైన నోట్లు రావడం, 100 విలువైన నోట్లు విరివిగా మార్కెట్లోకి రావడంతో, జనాల కష్టాలు తొలగిపోయాయి. తాజాగా, 2వేల విలువైన కరెన్సీ సరఫరాను ఆర్బీఐ తగ్గించి వేసింది. ఇదే సమయంలో 500 విలువైన కరెన్సీని ఎక్కువగా మార్కెట్లోకి తెస్తోంది. ఈ విషయాన్ని ఆర్బీఐ తన నివేదికలో పేర్కొంది.

2వేల విలువైన నోట్లు రీసర్క్యులేషన్ కిందనే తిరిగి తమ వద్దకు వస్తున్నాయని... ఆర్బీఐ నుంచి కొత్తగా నోట్లు రావడం లేదని ఎస్బీఐ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ నీరజ్ వ్యాస్ కూడా తెలిపారు. 

More Telugu News