: భారత 14వ రాష్ట్రపతిగా రామ్ నాథ్ కోవింద్.. ఎన్నికలో ఘన విజయం

రాష్ట్రపతి ఎన్నికలో రామ్ నాథ్ కోవింద్ ఘన విజయం సాధించారు. తన ప్రత్యర్థి, విపక్షాల అభ్యర్థి మీరాకుమార్ పై ఆయన భారీ తేడాతో విజయం సాధించారు. ఈ నేపథ్యంలో, ఆయన భారత 14వ రాష్ట్రపతిగా బాధ్యతలను స్వీకరించబోతున్నారు. 65.65 శాతం ఓట్లను కోవింద్ గెలుచుకున్నారు. యూపీయే అభ్యర్థి మీరాకుమార్ కు 34.35 శాతం మాత్రమే వచ్చాయి. కోవింద్ కు 7,02,644 ఓట్లు, మీర్ కుమార్ కు 3,67,314 ఓట్లు పడ్డాయి.  

More Telugu News