ajith: జేమ్స్ బాండ్ తరహాలో తెరకెక్కిన 'వివేగం'

తమిళంలోనే కాదు .. తెలుగులోను అజిత్ కి మంచి ఫాలోయింగ్ వుంది. అందువలన ఆయన సినిమాలు తమిళంతో పాటు తెలుగులోను విడుదలవుతుంటాయి. అలా అజిత్ తాజా చిత్రంగా 'వివేగం' తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. నవీన్ శొంఠినేని ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా, నిర్మాణానంతర కార్యక్రమాలను పూర్తి చేసుకుంటోందని చెప్పారు. జేమ్స్ బాండ్ తరహాలో ఈ సినిమా తెరకెక్కిందని అన్నారు. 110 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా, అజిత్ అభిమానులు ఆశించే విధంగా ఉంటుందని చెప్పారు. వీరం .. వేదాళం తరువాత అజిత్ - శివ చేస్తోన్న ఈ సినిమా, హ్యాట్రిక్ హిట్ కొట్టడం ఖాయమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాజల్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, విలన్ పాత్రను వివేక్ ఒబెరాయ్ చేశాడనే సంగతి తెలిసిందే.       

More Telugu News