: శ్రీశైలం టూరిస్ట్ బస్టాండ్ లో కొండచిలువ కలకలం.. వీడియో మీరూ చూడండి!

ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీశైలంలో కొండచిలువ కలకలం రేపింది. శ్రీశైలంలోని టూరిస్ట్ బస్టాండ్ లో కొండచిలువ కనిపించడంతో, ప్రయాణికులు భయంతో పలుగులు తీశారు. కొందరు ఈ సమాచారాన్ని అటవీశాఖ అధికారులకు అందించారు. వెంటనే అక్కడకు వచ్చిన అటవీశాఖ సిబ్బంది దాన్ని పట్టుకుని, అడవుల్లో వదిలిపెట్టారు. భారీ వర్షాల కారణంగా అటవీ ప్రాంతం నుంచి అది జనారణ్యంలోకి వచ్చి ఉండవచ్చని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు.

More Telugu News