: మరో మెట్రో పిల్లర్ ప్రమాదం... కారు ఢీకొని ఒకరి మృతి, నలుగురికి తీవ్ర గాయాలు

హైదరాబాద్ లోని మెట్రో రైలు పిల్లర్ మరోమారు టెర్రర్ పిల్లర్ గా మారింది. ఈ ఉదయం ఐదుగురు ప్రయాణిస్తున్న ఓ కారు చైతన్యపురి వద్ద పిల్లర్ ను ఢీకొనగా, ఒకరు అక్కడికక్కడే మరణించారు. కారులోని మిగతా నలుగురికీ తీవ్రగాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని అతి కష్టం మీద వారిని బయటకు తీశారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో దిల్ సుఖ్ నగర్ - ఎల్బీనగర్ పరిధిలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. కాగా, గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కేసును నమోదు చేసి విచారిస్తున్నామని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. ప్రమాదానికి అతి వేగమే కారణమని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్టు వారు తెలిపారు.

More Telugu News