: రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న సచిన్

తిరుమల శ్రీవారిని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో రేణిగుంట విమానాశ్రయానికి కొంచెం సేపటి క్రితం ఆయన చేరుకున్నారు. అక్కడి నుంచి తిరుమలకు సచిన్ పయనమయ్యారు. రేపు ఉదయం వీఐపీ దర్శనంలో స్వామివారిని సచిన్ దర్శించుకోనున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

More Telugu News