varun tej: చిరూ ఈ రోజు రాత్రి 'ఫిదా' చూసేస్తారట!

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ కథానాయకుడిగా చేసిన 'ఫిదా' చిత్రం, ఈ నెల 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ, తెలంగాణ అమ్మాయిని ప్రేమించే ఓ ఎన్నారై అబ్బాయిగా తాను ఈ సినిమాలో నటించానని చెప్పాడు. ఈ సినిమాకి అన్నీ కుదిరాయనీ .. శేఖర్ కమ్ముల ప్రతి పాత్రను అద్భుతంగా మలిచాడని అన్నాడు.

 ఈ సినిమా చూసిన అభిమానులు ఎలాంటి పరిస్థితుల్లోను నిరుత్సాహానికి లోను కారనే నమ్మకం ఉందని చెప్పాడు. నిన్న రాత్రి ఈ సినిమా చూసిన తన తండ్రి సంతోషాన్నీ .. సంతృప్తిని వ్యక్తం చేశాడని అన్నాడు. ఆయనకి ఈ సినిమా చాలా బాగా నచ్చేసిందని చెప్పాడు. ఇక ఈ రోజు రాత్రికి ఈ సినిమాను చిరంజీవి గారు చూస్తానన్నారనీ .. ఆయనకి చూపిస్తామని అన్నాడు. చిరంజీవిగారు చూసి భుజం తడితే చాలు .. అంతకు మించిన ఆనందం లేదని చెప్పుకొచ్చాడు

More Telugu News