: పూరీ జగన్నాథ్ విచారణ నేపథ్యంలో.. కాసేపట్లో అకున్ సబర్వాల్ మీడియా సమావేశం

టాలీవుడ్‌లో అలజడి రేపుతున్న డ్ర‌గ్స్ కేసులో ఈ రోజు ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్‌ని ప్రశ్నిస్తోన్న ఎక్సైజ్ శాఖ అధికారులు విచారణ ముగిసిన అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేయ‌నున్నారు. మ‌రో గంట‌సేప‌ట్లో పూరీని ప్ర‌శ్నించ‌డం పూర్తవుతుంది. ఆయ‌న నుంచి న‌లుగురు అధికారుల సిట్ బృందం వివ‌రాలు సేక‌రిస్తోంది. అనంతరం సిట్ అధికారి శ్రీనివాస‌రావు, ఎక్సైజ్ శాఖ డైరెక్ట‌ర్ అకున్ స‌బ‌ర్వాల్ మీడియాకు వివ‌రాలు తెల‌ప‌నున్నారు. ఈ కేసులో రేపు అధికారులు ఛార్మీని విచారించ‌నున్నారు.  

More Telugu News