: డ్రగ్స్ విషయంలో పూరి జగన్నాథ్ గురించి మెగా హీరో స్పందన!

డ్రగ్స్ వ్యవహారంలో నోటీసులు అందుకున్న వారంతా సిట్ విచారణకు హాజరు కావాల్సిందేనని మెగా హీరో వరుణ్ తేజ్ అన్నాడు. చట్టాన్ని గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉంటుందని చెప్పాడు. ఈ వ్యవహారంలో నోటీసులు అందుకున్నవారంతా ఇప్పటికే మీడియా ద్వారా తమ స్పందనను తెలియజేశారని తెలిపాడు. డ్రగ్స్ తీసుకోవడం మంచిది కాదని... మెరుగైన ఆరోగ్యం కంటే ఏదీ గొప్పది కాదని అన్నాడు.

పూరీ జగన్నాథ్ గురించి మాట్లాడుతూ, ఆయన చాలా మంచి వ్యక్తి అని కితాబిచ్చాడు. ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటారని... పాజిటివ్ యాటిట్యూడ్ తో ఉంటారని చెప్పాడు. ఇతరుల గురించి చెడుగా మాట్లాడే స్వభావం కూడా ఆయనకు లేదని అన్నాడు. తన పక్కనుండే వాళ్లను జగన్ చాలా మంచిగా చూసుకుంటాడని... ఆయన ఏం ఆహారం తీసుకుంటే, వాళ్లింట్లోని బాయ్ కు కూడా అదే ఫుడ్ పెడతారని చెప్పాడు. ఆయన పేరు డ్రగ్స్ వ్యవహారంలో బయటకు రావడంతో తాను షాక్ కు గురయ్యానని తెలిపాడు. 

More Telugu News