: శివాలయం గర్భగుడిలో తుపాకితో కాల్చుకుని బీజేపీ నేత ఆత్మహత్య!

భారతీయ జనతా పార్టీకి చెందిన ఓ నేత శివాలయంలోకి ప్రవేశించి, గర్భగుడిలో ఆత్మహత్య చేసుకోవడం కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లా రశీగేహళ్లిలో కలకలం రేపింది. బీజేపీ బ్లాక్ విభాగం వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న శివనగౌడ్ పాటిల్, దైవ సన్నిధిలో తుపాకితో తలకు గురిపెట్టుకుని నలుగురూ చూస్తుండగానే కాల్చుకుని మరణించారు. ఇక్కడి గిరిమల్లేశ్వర స్వామి దేవాలయానికి వచ్చిన ఆయన, గర్భగుడిలోకి ప్రవేశించి, కాల్చుకున్నాడు. భక్తులు ఇచ్చిన సమాచారంతో ఘటనాస్ధలికి చేరుకున్న పోలీసులు, మతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, పాటిల్‌ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సివుందని అధికారులు వెల్లడించారు.

More Telugu News