: షియోమీ సూపర్ ఆఫర్.. రేపు, ఎల్లుండి రూపాయికే రెడ్‌‌మీ 4ఏ స్మార్ట్‌ఫోన్!

చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ షియోమీ భారత్‌ వినియోగదారులకు బ్రహ్మాండమైన ఆఫర్ ప్రకటించింది. తన ఎంఐ బ్రాండ్‌ను ప్రారంభించి  మూడేళ్లు అవుతున్న శుభసందర్భంగా రెండు రోజులపాటు ప్రత్యేక సేల్ నిర్వహించనున్నట్టు తెలిపింది. గురు, శుక్రవారాల్లో నిర్వహించే ఈ సేల్‌లో కంపెనీ యాక్సెసరీలతోపాటు రెడ్‌మీ 4, రెడ్‌మీ నోట్ 4 స్మార్ట్‌ఫోన్లు, సరికొత్త పవర్ బ్యాంకులను అందుబాటులో ఉంచనున్నట్టు తెలిపింది. అలాగే 20, 21 తేదీల్లో ఉదయం 11 గంటలకు, మధ్యాహ్నం ఒంటిగంటకు ఫ్లాష్ సేల్ నిర్వహించనున్నట్టు పేర్కొంది.

ఫ్లాష్‌సేల్‌లో భాగంగా రూపాయికే రెడ్‌మీ 4ఏ, వై-ఫై రిపీటర్ 2, 10,000 ఎంఏహెచ్ పవర్ బ్యాంకు 2 తదితర వాటిని సొంతం చేసుకోవచ్చు. గోఇబిబో ద్వారా దేశయంగా హోటల్స్ బుక్ చేసుకున్న వారికి రూ.2వేల రాయితీ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఎస్‌బీఐ డెబిట్, క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేసే వారికి అదనంగా 5 శాతం క్యాష్ బ్యాక్, రూ.8 వేలకు పైన కొనుగోలు చేస్తే ఒక్కో కార్డుపై రూ.500 క్యాష్‌ బ్యాక్ ఆఫర్ ప్రకటించింది.

 

More Telugu News