varun tej: 'ఫిదా' స్టోరీని ముందుగా ముగ్గురు స్టార్ హీరోలు విన్నారట!

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో .. దిల్ రాజు నిర్మాణంలో 'ఫిదా' చిత్రం తెరకెక్కింది. ఈ నెల 21వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ .. ఈ కథను ముందుగా ముగ్గురు స్టార్ హీరోలకి వినిపించడం జరిగిందని అన్నారు. ఆ ముగ్గురు హీరోలకి ఈ కథ చాలా బాగా నచ్చిందట .. అయితే ఈ కథకి తాము సరిపోమని చెప్పారట.

 అప్పుడు వరుణ్ తేజ్ ను ఎంపిక చేసుకోవడం జరిగిందని అన్నారు. దిల్ రాజు అలా చెప్పిన దగ్గర నుంచి ఈ కథను ముందుగా విన్న ముగ్గురు కథానాయకులు ఎవరనే ఆసక్తి అందరిలో తలెత్తుతోంది. ఆ ముగ్గురు హీరోల్లో మహేశ్ బాబు .. చరణ్ తో పాటు మరో స్టార్ హీరో ఉన్నాడనే టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.      

More Telugu News