rana: తనకి, తన తండ్రికి నచ్చిన ఫస్టు కథ ఇదేనంటోన్న రానా!

రానా కథానాయకుడిగా తేజ దర్శకత్వంలో 'నేనే రాజు నేనే మంత్రి' షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమాను గురించి రానా స్పందించాడు. 5 సంవత్సరాల పరిధిలో ఈ కథ జరుగుతుందనీ, కథ పెద్దది కావడం వల్లనే తేజ ఈ సినిమాను 2 గంటల 40 నిమిషాల్లో చెప్పాడని అన్నాడు.

ఈ సినిమాలో తాను జోగేంద్రగా కనిపిస్తాననీ .. ఈ పాత్ర చుట్టూనే కథ తిరుగుతుందని చెప్పాడు. ఈ పాత్ర తనకి మాత్రమే కాదు .. తన తండ్రికి కూడా చాలా బాగా నచ్చిందని అన్నాడు. తామిద్దరికీ నచ్చిన ఫస్టు కథ ఇదే కావడం విశేషమని చెప్పాడు. ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు వస్తోన్న ఈ సినిమా, అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉందని చెప్పుకొచ్చాడు.         

More Telugu News