: డ్రగ్స్ కేసును సంచలనం చేయొద్దు.. దాని వల్ల ఎవరికి లాభం?.. రానా సూటి ప్రశ్న

సంచలనం సృష్టిస్తున్న డ్రగ్స్ కేసుపై టాలీవుడ్ నటుడు రానా స్పందించాడు. డ్రగ్స్ వ్యవహారాన్ని భూతద్దంలో చూడవద్దని, దానిని పెద్దది చేసి చూపడం వల్ల ఎవరికి లాభమని ప్రశ్నించాడు. సమాజానికి డ్రగ్స్ ఏమాత్రం మంచివి కావన్న రానా విద్యార్థులు కూడా వాటికి బానిసలు కావడం బాధాకరమన్నాడు. చిత్రపరిశ్రమలో కొందరు వీటికి అలవాటు పడి ఉండొచ్చని పేర్కొన్నాడు. సంచలనం కోసం ఈ కేసును ఉపయోగించుకోవద్దని మీడియాను కోరాడు. డ్రగ్స్ బాధితుల పేర్లు బయటపెట్టడం సరికాదని పేర్కొన్నాడు. ఇది చాలా సున్నితమైన సమస్య అని, ఈ కేసు విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందన్నాడు. ఒక హీరోకు ఏదైనా అలవాటు ఉంటే అభిమానులు కూడా వాటిని ఆచరిస్తారా? ఆ హీరోకు మందు, సిగరెట్ అలవాటు లేకుంటే ఎవరూ ముట్టుకోరా? అని కాస్తంత ఆవేశంగా ప్రశ్నించాడు.

More Telugu News