: అందుకే ఇంట్లోంచి పారిపోయి ముంబై వ‌చ్చేశా: కొత్త విష‌యం చెప్పిన బాలిక సాయి పూర్ణిమ‌

గత నెల ఏడవ తేదీ నుంచి కనిపించకుండా పోయిన సాయి పూర్ణిమను క‌లిసేందుకు ఆమె త‌ల్లిదండ్రులు ముంబ‌యికి వెళ్లిన విష‌యం తెలిసిందే. అయితే, త‌ల్లిదండ్రుల‌ను క‌లిసేందుకు సాయి పూర్ణిమ ఒప్పుకోలేదు. అంతేగాక‌, తాను ఇంట్లోంచి పారిపోవ‌డానికి గ‌ల కార‌ణం ఇదేనంటూ కొత్త విష‌యం చెబుతోంది. త‌న‌ మొహం చూస్తే తల్లిదండ్రులకు హాని కలుగుతుందని కల వచ్చిందని, అందుకే  తాను ముంబ‌యికి వ‌చ్చేశాన‌ని తెలిపింది.

తాను ఏడాదిపాటు తల్లిదండ్రులకు దూరంగానే ఉంటానని పేర్కొంది. తాను త‌న తల్లిదండ్రుల వెంట వెళ్లబోన‌ని స్ప‌ష్టం చేసింది. పూర్ణిమ మాట‌ల‌కు షాక్ అయిన ఆమె తల్లిదండ్రులు ఏం చేయాలో తెలియ‌క త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. ఈ విషయాన్ని బాచుపల్లి పోలీసులకు అక్క‌డి పోలీసులు సమాచారం ఇవ్వ‌డంతో పూర్ణిమను తీసుకురావడానికి మహిళా ఏఎస్సైను ముంబయి పంపించారు. 

More Telugu News