balakrishna: 'పైసా వసూల్' రిలీజ్ డేట్ మరింత ముందుకు?

పూరీ జగన్నాథ్ ఎంత ఫాస్టుగా సినిమాలను తెరకెక్కిస్తాడనేది అందరికీ తెలిసిందే. అదే పద్ధతిని ఆయన 'పైసా వసూల్' సినిమా విషయంలోను అనుసరించాడు. చిత్రీకరణ పరంగా ఈ సినిమా చివరి దశకి చేరుకుంది. షూటింగును మొదలుపెట్టిన రోజునే ఈ సినిమాను సెప్టెంబర్ 29వ తేదీన విడుదల చేయనున్నట్టు చెప్పారు. అయితే ఈ సినిమాకి పోటీగా మహేశ్ .. ఎన్టీఆర్ మూవీలు సిద్ధమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఈ సినిమా అక్టోబర్ కి వెళ్లే ఛాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది. అయితే అందులో నిజం లేదట .. పైపెచ్చు ఈ సినిమా రిలీజ్ డేట్ మరింత ముందుకు జరగనుందని అంటున్నారు. ఈ సినిమా ఫస్టు కాపీ సెప్టెంబర్ 15కి రెడీ అవుతుందట. అందువలన ఆ నెల 21న గానీ 22 గాని సినిమాను రిలీజ్ చేయాలనే ఆలోచన చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.   

More Telugu News