: నంద్యాలలో టీడీపీ తీరుపై కేంద్ర ఎన్నికల సంఘానికి వైసీపీ ఫిర్యాదు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అధికార టీడీపీ తీరుపై కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఫిర్యాదు చేసింది. భూమా నాగిరెడ్డి మృతితో ఖాళీ అయిన నంద్యాల అసెంబ్లీ నియోజ‌క వ‌ర్గంలో త్వ‌ర‌లో ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో టీడీపీ నేత‌లు అధికార దుర్వినియోగానికి పాల్ప‌డుతున్నార‌ని వైసీపీ ఫిర్యాదు చేసింది. ఈ ప్రాంత ప్ర‌జ‌ల‌ను టీడీపీ నేత‌లు ప‌లు విధాలుగా ప్ర‌లోభ‌పెడుతున్నార‌ని తెలిపింది. ఇందుకు సంబంధించి ఓ ఫిర్యాదు లేఖ‌ను వైసీపీ నేత‌లు అధికారుల‌కు స‌మ‌ర్పించారు. టీడీపీ తీరుపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. నంద్యాలలో ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ తాము వేసిన రోడ్లపై నడుస్తూ, తామిస్తున్న పింఛన్లు తీసుకుంటూ వైసీపీకి ఓట్లేస్తారా? అని అడిగారని వైసీపీ ఎంపీలు ఈ సందర్భంగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. 

More Telugu News