: ఓటు వేయడానికి.. ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లిన దివాకర్ రెడ్డి

అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే జేసీ దివాకర్ రెడ్డి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు గాను ఆయన స్పెషల్ ఫ్లైట్ లో ఢిల్లీకి బయల్దేరారు. తనపై విమానయాన సంస్థలు ట్రావెల్ బ్యాన్ విధించిన నేపథ్యంలో, జేసీకి ఈ కష్టం వచ్చింది. కాగా, ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వానికి ఆయన ఫిర్యాదు చేయనున్నారు. పోలింగ్ పూర్తయిన తర్వాత ఆయన అరుణ్ జైట్లీతో సమావేశమవుతారని తెలుస్తోంది. మరోవైపు చంద్రబాబు కూడా ఈ విషయాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలని కొన్ని రోజుల క్రితం జేసీకి సూచించిన విషయం తెలిసిందే. 

More Telugu News