mahesh babu: జనవరిలో వంశీ పైడిపల్లితో సెట్స్ పైకి వెళ్లనున్న మహేశ్

మహేశ్ తాజా చిత్రంగా ప్రేక్షకులను పలకరించడానికి 'స్పైడర్' సినిమా రెడీ అవుతోంది. ఈ సినిమా విడుదలకి ముస్తాబవుతూ ఉండగానే, కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'భరత్ అను నేను' షూటింగులో మహేశ్ పాల్గొంటున్నాడు. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే ఆయన తదుపరి సినిమాకి కూడా రంగాన్ని సిద్ధం చేస్తున్నాడు.

 వంశీ పైడిపల్లి ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. అన్ని వైపుల నుంచి ఈ సినిమాకి సంబంధించిన కసరత్తు జరుగుతోంది. జనవరిలో ఈ సినిమాను లాంచ్ చేయాలనే నిర్ణయానికి దర్శక నిర్మాతలు వచ్చినట్టుగా తాజా సమాచారం. దిల్ రాజు .. అశ్వనీదత్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమా, దాదాపు యూఎస్ నేపథ్యంలో తెరకెక్కనుందట. మహేశ్ బాబు సరసన పూజా హెగ్డేను తీసుకునే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి.         

More Telugu News