: ఓటు వేసేందుకు అంబులెన్సులో బయల్దేరనున్న ఎమ్మెల్యే!

పెద్దపల్లి టీఆర్ఎస్ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గత కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. అపోలో ఆసుపత్రిలో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో, ఈరోజు జరుగుతున్న రాష్ట్రపతి ఎన్నికలో ఓటు వేయడానికి ఆయన ఆసుపత్రి నుంచి అసెంబ్లీకి అంబులెన్సులో బయల్దేరనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

పార్టీకి చెందిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే తప్పని సరిగా ఓటు వేయాలని నిన్న జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించిన సంగతి తెలిసిందే. అనారోగ్యంతో ఉన్నవారు కూడా ఓటు వేయాల్సిందేనని... అవసరమైతే వారిని అంబులెన్సులో తరలించాలని ఆయన సూచించారు. ఈ నేపథ్యంలో, మనోహర్ రెడ్డి అంబులెన్సులో బయల్దేరడానికి సిద్ధమవుతున్నారు. మరోవైపు, మనోహర్ రెడ్డి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ, ఆయన అభిమానులు, టీఆర్ఎస్ కార్యకర్తలు నిన్న ప్రత్యేక పూజలు చేశారు.

More Telugu News