: నిజాంపేటలో నెల రోజుల క్రితం అదృశ్యమైన విద్యార్థిని పూర్ణిమ సాయి ఆచూకీ లభ్యం!

గత నెల 7న హైదరాబాద్, నిజాంపేటలో అదృశ్యమైన పదో తరగతి విద్యార్థిని పూర్ణిమ సాయి ఆచూకీ లభ్యమైంది. ముంబైలోని దాదర్ లో పూర్ణిమ సాయి ఉండటాన్ని అక్కడి ఓ స్వచ్ఛంద సంస్థ గుర్తించింది. ఈ విషయాన్ని సైబరాబాద్ పోలీసులకు తెలియజేయడంతో అక్కడికి వెళ్లారు. ముంబై నుంచి ఆమెను హైదరాబాద్ కు తీసుకురానున్నారు. కాగా, నిజాంపేటకు చెందిన పదమూడేళ్ల పూర్ణిమ సాయి స్కూల్‌కని వెళ్లి.. అదృశ్యమైంది.

దీంతో, ఆ బాలిక తల్లిదండ్రులు తమ బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో వెతికారు. బాలల హక్కుల సంఘాన్ని ఆశ్రయించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో, బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తొలుత, మిస్సింగ్‌ కేసుగా నమోదు చేసిన పోలీసులు,ఆ తర్వాత దీనిని కిడ్నాప్‌ కేసుగా మార్చారు.

More Telugu News