Balakrishna: డబ్బింగ్ మొదలుపెట్టిన 'పైసా వసూల్'!

బాలకృష్ణ 101వ సినిమాగా 'పైసా వసూల్' సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం జరుగుతోన్న చివరి షెడ్యూల్ షూటింగ్ ఈ నెల 28వ తేదీతో ముగియనుంది. షూటింగ్ చివరిదశలో ఉండగానే .. ఈ సినిమాకి సంబంధించిన డబ్బింగ్ పనులను మొదలు పెట్టేశారు. హైదరాబాద్ - ప్రసాద్ ల్యాబ్స్ లో పూజా కార్యక్రమాలను నిర్వహించి, ఈ సినిమా యూనిట్ డబ్బింగ్ ను మొదలుపెట్టింది.

బాలకృష్ణ కొత్త లుక్ తో మరింత యంగ్ గా .. స్టైలిష్ గా కనిపించనుండటం ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ కానుంది. శ్రియ .. ముస్కాన్ కథానాయికలుగా నటిస్తోన్న ఈ సినిమాను, దసరా కానుకగా సెప్టెంబర్ 29న విడుదల చేయనున్నారు. మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని వస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి.

More Telugu News