: వైసీపీ నేత బాలినేని హౌస్ అరెస్టు!

ప్రకాశం జిల్లాలో భూవివాదాల ఆందోళనల నేపథ్యంలో వైసీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఈ రోజు ఉదయమే ఆయన ఇంటికి చేరుకున్న పోలీసులు గృహ నిర్బంధం చేశారు. జిల్లాలో భూవివాదాలపై  వైసీపీ, సీపీఎం పార్టీలు ఆందోళనకు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో ముందస్తుగా పలువురు ఆ పార్టీలకు చెందిన నేతలను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు చెప్పారు. కాగా, బాలినేనిని హౌస్ అరెస్ట్ చేయడంతో ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.

More Telugu News