: కమలహాసన్ సారీ చెప్పాల్సిందే: జాతీయ మహిళా కమిషన్‌

సినీనటుడు కమలహాసన్‌పై జాతీయ మహిళా కమిషన్‌(ఎన్సీడబ్యూ) మ‌రోసారి మండిప‌డింది. లైంగిక వేధింపులకు గురైన మలయాళ నటి పేరును క‌మ‌లహాస‌న్ నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా మీడియా ముందు ప‌లికార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోన్న ఎన్సీడ‌బ్యూ ఛైర్‌పర్సన్‌ లలితా కుమారమంగళం ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ... క‌మ‌ల‌హాస‌న్ తాను చేసిన వ్యాఖ్య‌ల‌పట్ల‌ క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించి కమల్‌కు తాము ఇప్ప‌టికే లేఖ పంపించామని తెలిపారు. అలాగే క‌మ‌ల్ చేసిన‌ వ్యాఖ్యలను తిరిగి వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేసిన‌ట్లు చెప్పారు.    

More Telugu News