ramyakrishna: 'శివగామి' పాత్రను రమ్యకృష్ణ పోషించడం పై మధుబాల కామెంట్!

'బాహుబలి' సినిమా చూసినవారికి అందులో 'శివగామి' పాత్ర ఎంత కీలకమైనదనేది ఇట్టే తెలిసిపోతుంది. రమ్యకృష్ణకి ఈ పాత్ర తెచ్చిపెట్టిన క్రేజ్ అంతా ఇంతా కాదు. 'బాహుబలి' కథ ఆధారంగా తెరకెక్కుతోన్న 'ఆరంభ్' ధారావాహికలో ఈ పాత్రను 'రోజా' ఫేం మధుబాల పోషిస్తోంది. 'బాహుబలి'లో 'శివగామి' పాత్రకి ముందుగా శ్రీదేవిని అనుకోవడం .. ఆ తరువాత ఆ ఛాన్స్ రమ్యకృష్ణకి రావడం గురించి మధుబాల ప్రస్తావించింది.

ఈ పాత్ర రమ్యకృష్ణ చేయాలని రాసి పెట్టి వుంది .. అందుకే ఆ పాత్ర ఆమెను వెతుక్కుంటూ వచ్చిందని చెప్పింది. ఈ పాత్రలో రమ్యకృష్ణ అద్భుతంగా నటించి .. మంత్రముగ్ధులను చేసిందని అంది. ఏ పాత్రనైనా ఆమె అవలీలగా పండిస్తుందనే సంగతి తనకి తెలుసని చెప్పింది. సినిమాలో ఆమె చేసిన పాత్ర .. సీరియల్ లో తాను చేస్తుండటం గర్వంగా వుందంటూ సంతోషాన్ని వ్యక్తం చేసింది.  గతంలో ఈ ఇద్దరూ 'అల్లరిప్రియుడు'లో కలిసి నటించిన సంగతి తెలిసిందే.             

More Telugu News