: నితీశ్ కుమార్‌, లాలూ ప్ర‌సాద్ యాద‌వ్‌ల‌కు ఫోన్ చేసి.. విడిపోవ‌ద్ద‌ని చెప్పిన సోనియా

ఆర్జేడీ నేత లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ కుటుంబ స‌భ్యుల‌కు సంబంధించిన ఇళ్లు, కార్యాల‌యాల్లో ఇటీవ‌ల‌ సీబీఐ సోదాలు నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఆర్జేడీతో విడిపోతార‌ని వార్తలు వచ్చాయి. అయితే, నితీశ్ మాత్రం లాలూతో విడిపోయే స‌మ‌స్యేలేద‌ని చెప్పారు. తాజాగా ఆ ఇరువురు నేత‌ల‌కు కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు సోనియా గాంధీ ఫోన్ చేసి మాట్లాడారు. విడిపోకూడ‌ద‌ని ఇరువురు నేత‌లకు సూచించారు. దీంతో నితీశ్‌, లాలూ కొన్ని రోజుల్లో అన్ని సమ‌స్య‌లూ తొల‌గిపోతాయ‌ని సోనియాతో చెప్పిన‌ట్లు కాంగ్రెస్ పార్టీ ప్ర‌తినిధి హ‌రేంద్ర కుమార్ చెప్పారు.

More Telugu News