: అక్టోబర్లో సెట్స్ మీదకి రణ్బీర్ కపూర్ `డ్రాగన్`
అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణ్బీర్ కపూర్ నటించనున్న `డ్రాగన్` సినిమా షూటింగ్ అక్టోబర్ నుంచి ప్రారంభంకానుంది. ఈ విషయాన్ని `జగ్గా జాసూస్` ప్రత్యేక షో సందర్భంగా రణ్బీర్ చెప్పారు. ప్రస్తుతం తాను నటిస్తున్న సంజయ్దత్ బయోపిక్ `దత్` సినిమా షూటింగ్ సెప్టెంబర్లోగా పూర్తవుతుందని, ఆ తర్వాత అక్టోబర్ 15 నుంచి `డ్రాగన్` షూటింగ్ మొదలవుతుందని ఆయన తెలిపారు. సైన్స్ ఫిక్షన్ ప్రేమకథగా తెరకెక్కనున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, ఆలియా భట్లు కీలక పాత్రల్లో నటించనున్నట్లు సమాచారం. `వేక్ ఆప్ సిడ్`, `యే జవానీ హై దివానీ` సినిమాల తర్వాత అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణ్బీర్ నటిస్తున్న మూడో చిత్రమిది.