varun tej: సెన్సార్ పూర్తి చేసుకున్న 'ఫిదా' మూవీ

ఆనందం .. అనుభూతి కలగలిసినవిగా శేఖర్ కమ్ముల సినిమాలు ఉంటాయి. ఫీల్ తో కూడిన ఆయన సినిమాలను చూడటానికి చాలామంది ఇష్టపడుతుంటారు. అలాంటి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన 'ఫిదా' చిత్రం, ఈ నెల 21వ తేదీన భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని, క్లీన్ యు సర్టి ఫికేట్ ను సంపాదించుకుందని నిర్మాత దిల్ రాజు చెప్పారు.

ఈ సినిమా చూసిన సెన్సార్ సభ్యులు .. ఒక మంచి సినిమా వస్తున్నందుకు అభినందించారని అన్నారు. యూత్ తో పాటు కుటుంబసమేతంగా చూడదగినదిగా ఈ సినిమా ఉంటుందని చెప్పారు. టీజర్ కి .. ఆడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది కనుక, సినిమాకి కూడా మంచి ఆదరణ లభిస్తుందనే నమ్మకంతో ఉన్నామని అన్నారు.          

More Telugu News