: టాలీవుడ్ నటులను సెన్సేషనలైజ్ చేయకండి... సెన్సువల్ గా ప్రచురించండి: అకున్ సబర్వాల్ సూచన

టాలీవుడ్ కు సంబంధించిన నటులు, నటీమణులకు సంబంధించిన వార్తలను సెన్సేషనలైజ్ చేయవద్దని ఎక్సైజ్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ సూచించారు. తాము గత వారం రోజులుగా డ్రగ్స్ కు సబంధించిన దర్యాప్తు చేస్తున్నామని, సమస్య మూలాలను రూపుమాపే ప్రయత్నంలో ఉన్నామని ఆయన చెప్పారు. తమ ప్రయత్నాన్ని సెన్సేషనలైజేషన్ కోసం నీరు గార్చవద్దని ఆయన సూచించారు. ఈ కేసును తాము చాలా సెన్సువల్ గా డీల్ చేస్తున్నామని ఆయన చెప్పారు. మీడియా కూడా అలాగే ఈ విషయాన్ని సెన్సువల్ గా డీల్ చేయాలని ఆయన సూచించారు.

అందరి లక్ష్యం సమస్యను పరిష్కరించడమేనని, అందువల్ల అందరూ కలిసి పని చేయాలని ఆయన కోరారు. డ్రగ్స్ తో సంబంధం ఉన్నవారి పేర్లను బహిర్గతం చేయడం చట్టపరంగా, నైతికంగా తప్పు అని ఆయన చెప్పారు. దయచేసి పేర్లు, వివరాలు వెల్లడించవద్దని ఆయన సూచించారు. చట్టపరంగా నడవడం అందరి బాధ్యత అని, నిబంధనలకు విరుద్ధంగా ఎవరూ నడవవద్దని ఆయన సూచించారు. ఒక నేరం విచారణలో పలురకాల అనుమానితులు ఉంటారని, అందరి నుంచి వివరాలు సేకరిస్తామని ఆయన తెలిపారు. కేవలం నేరం చేసిన వారిని మాత్రమే కాదని, వారి నుంచి ఏదైనా సమాచారం వస్తుందని భావించినా వారిని విచారణలో సహకరించాలని కోరుతామని ఆయన సూచించారు. 

More Telugu News