Nivetha: సినిమా కబుర్లు ... సంక్షిప్త సమాచారం

*  తాజాగా 'నిన్ను కోరి' సినిమాతో తన ఖాతాలో మరో హిట్ చిత్రాన్ని వేసుకున్న నివేదా థామస్, తెలుగులో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవాలనుకుంటోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ తో కలసి చేస్తున్న 'జై లవ కుశ' సినిమాలో తనే డబ్బింగ్ చెబుతుందట. తెలుగు తనకు బాగా వచ్చేసిందని, ఈ సినిమాలో డబ్బింగ్ చెప్పేస్తానని ఈ చిన్నది ధీమాగా చెబుతోంది.
*  సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'రంగస్థలం' సినిమాలో తాను పంచాయతీ సర్పంచ్ గా కీలక పాత్రను పోషిస్తున్నానని ప్రముఖ నటుడు జగపతి బాబు తెలిపారు. ఇందులో రామ్ చరణ్, సమంత జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
*  'భద్రం బీ కేర్ ఫుల్ బ్రదరూ' చిత్రం ద్వారా ఆమధ్య హీరోగా పరిచయమైన శ్రీరాజ్ తాజాగా హాలీవుడ్ చిత్రంలో నటించే ఛాన్స్ సంపాదించాడు. 'రష్ అవర్' వంటి భారీ హిట్ చిత్రాన్ని తీసిన హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బ్రెట్ రాట్నర్ నిర్మించే చిత్రంలో శ్రీరాజ్ ఆఫర్ కొట్టాడు. న్యూయార్క్ బ్యాక్ డ్రాప్ లో ఇది రూపొందుతుంది.
*  మహేశ్ బాబు సోదరి మంజుల దర్శకత్వం వహిస్తున్న చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదు పరిసరాల్లో జరుగుతోంది. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో అమైరా దస్తర్, త్రిదా చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

More Telugu News