: హైదరాబాద్ లో ఇద్దరు అమ్మాయిల అదృశ్యం.. పోలీసులకు తల్లిదండ్రుల ఫిర్యాదు

హైద‌రాబాద్‌, కేపీహెచ్‌బీ సమీపంలోని హైద‌ర్‌న‌గ‌ర్‌లో ఇద్ద‌రు అమ్మాయిలు అదృశ్యం కావ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. త‌మ కూతుళ్లు స్వ‌ప్న‌ (20), మౌనిక (19) నిన్న‌టి నుంచి క‌నిపించ‌డం లేద‌ని వారి త‌ల్లిదండ్రులు ఈ రోజు కూక‌ట్ ప‌ల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిన్న వారిరువురూ కూలి ప‌నికని చెప్పి వెళ్లార‌ని, అయితే ఇప్ప‌టివ‌ర‌కూ ఇంటికి తిరిగిరాలేద‌ని అన్నారు. వారి నుంచి ఫిర్యాదు సేక‌రించిన పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల ద్వారా వారి ఆచూకీని క‌నుగొనాల‌ని పోలీసులు భావిస్తున్నారు. స్వ‌ప్న, మౌనికల‌ స్నేహితురాళ్లను కూడా సంప్ర‌దించాల‌ని యోచిస్తున్నారు.

More Telugu News