: సెక్యూరిటీ ఏజెన్సీ సంస్థను ప్రారంభించిన రాందేవ్ బాబా!

పతంజలి ఉత్పత్తులతో ఎఫ్ఎంసీజీ మార్కెట్లో యోగా గురు బాబా రాందేవ్ ఓ రేంజ్ లో దూసుకుపోతున్నారు. ఇప్పుడు ఆయన మరో సంస్థను ప్రారంభించారు. 'పరాక్రమ్ సురక్ష ప్రైవేట్ లిమిటెడ్' పేరుతో ఓ భద్రతా సంస్థను స్థాపించారు. జూలై 10వ తేదీని ఈ సంస్థను లాంచ్ చేసినట్టు తెలుస్తోంది. త్వరలోనే తమ సంస్థ దేశంలోని అతి పెద్ద సెక్యూరిటీ ఏజెన్సీల్లో ఒకటిగా ఎదుగుతుందని రాందేవ్ బాబా ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సంస్థ ద్వారా దేశంలో 20 నుంచి 25 వేల మందికి ఉద్యోగం కల్పిస్తామని చెప్పారు. వ్యక్తిగత రక్షణ, దేశ భద్రత విధుల కోసం యువతను సన్నద్ధం చేయడమే తమ సంస్థ లక్ష్యమని తెలిపారు. యువతకు శిక్షణ ఇవ్వడానికి రిటైర్డ్ ఆర్మీ, పోలీసు అధికారులను నియమించుకుంటామని చెప్పారు. 

More Telugu News