: రెండు రోజుల క్రితం ప్రధాని మోదీతో భేటీ అయిన లక్ష్మీపార్వతి?

రెండు రోజుల క్రితం ప్రధాని మోదీతో వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి భేటీ అయినట్టు సమాచారం. అయితే, ఎంతో సంచలనం కలిగించే ఈ వార్త మీడియాలో మాత్రం రాలేదు. కనీసం వైసీపీ మీడియా 'సాక్షి'లో కూడా దీనికి సంబంధించిన కథనం రాకపోవడం గమనార్హం. మోదీ అపాయింట్ మెంట్ ఇవ్వడంతో... ఢిల్లీకి వెళ్లి ఆయనను కలిశారు లక్ష్మీపార్వతి. వీరిద్దరి మధ్య ఎలాంటి చర్చ జరిగిందన్న విషయం తెలియరాలేదు. అయితే, దివంగత ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని కోరేందుకు ప్రధానిని లక్ష్మీపార్వతి కలిశారని చెబుతున్నారు. 

More Telugu News