amy jaceson: ఎమీ జాక్సన్ పారితోషికం ఎందుకు తగ్గించిందబ్బా?

వెండితెరపై నాజూకు సౌందర్యాన్ని ప్రదర్శించే కథానాయికలలో ఎమీ జాక్సన్ ఒకరు. గ్లామర్ విషయంలో అమ్మడిని వంక పెట్టలేం. శంకర్ దర్శకత్వంలో ఆమె 'ఐ' వంటి భారీ సినిమా చేయడం వలన .. ఆ తరువాత '2.0' వంటి భారీ సినిమాను ఒప్పుకోవడం వలన బయట చిత్రాలను పెద్దగా చేయలేక పోయింది. అయితే శంకర్ దర్శకత్వంలో చేయడం వలన ఆమెకి స్టార్ హీరోయిన్ స్టేటస్ వచ్చేసింది.

అయితే, దర్శక నిర్మాతలు మాత్రం ఆమెను ఆ రేంజ్ లో చూడటం లేదట. అందుకనే ఆమె అడిగినంత ఇవ్వడానికి వెనుకాడుతున్నారనేది కోలీవుడ్ సమాచారం. '2.0' రిలీజ్ తరువాత తన కెరియర్ మరింత ఊపందుకుంటుందనే ఆశతో ఎమీ జాక్సన్ ఉందట. ఈ క్రమంలోనే ఆమె మోహన్ లాల్ సరసన 'ది విలన్' సినిమా చేయడానికి అంగీకరించిందని అంటున్నారు. రెమ్యునరేషన్ విషయంలో కొండెక్కి కూర్చున్న ఈ సుందరి, తక్కువ పారితోషికానికే ఓకే చెప్పడం మిగతా కథానాయికలకు మింగుడు పడటం లేదట.    

More Telugu News